Tuesday 16 May 2023

Victory of Kannada civil society democracy

 కన్నడ పౌరసమాజ ప్రజాస్వామ్య విజయం

ABN , First Publish Date - 2023-05-16T01:05:03+05:30 IST

Victory of Kannada civil society democracy 

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఒక ఉక్కపోత వాతావరణంలో కొంత హాయిని కలిగించే గాలిలా ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, దాని నాయకత్వం తాము ఏది చేసినా చెల్లుతుందని, తమకు ఎదురులేదని ఒక భయానక స్థితిని కల్పించాయి. ఈ కాస్త ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగుతుందా, రాజ్యాంగ విలువలు నిలదొక్కుకోగలుగుతాయా, అసలు రాజ్యాంగం ఈ ధాటికి నిలుస్తుందా అన్న కొన్ని మౌలిక సవాళ్లు దేశం ఎదుర్కొంటున్నది. 

భారతీయ జనతాపార్టీ కేవలం ఇతర రాజకీయ పార్టీల వలె నిర్మాణమైతే సమస్య ఏం లేదు. సమస్యల్లా ఆ పార్టీని నడిపించే మాతృసంస్థల భావజాలమే జటిలమైన సమస్య. రాజ్యాంగ విలువలు ఒక్కరోజు పుట్టినవి కావు. వాటి వెనుక ప్రపంచవ్యాప్త ప్రజాపోరాటాలు, స్వాతంత్రోద్యమాలు, అసాధారణమైన త్యాగాలు, నూతన మానవ విలువలు, ఉన్నతమైన, ఉదాత్తమైన మానవ సంబంధాలు వాటి పునాదుల్లో ఉన్నాయి. చరిత్ర ముందుకుపోవడం, మానవ నాగరికత మరింత వికాసం చెందడానికి ఉన్నతమైన విలువలతో కూడిన నాగరిక సమాజం నిర్మాణం దిశలో ప్రయాణం ఉండాలి. సమాజాన్ని, ప్రజలని ముఖ్యంగా బలహీనులని ప్రేమించే తాత్వికత కావాలి. మనుషులని ద్వేషించడం, తమ భావజాలాన్ని అంగీకరించని వారిని ద్రోహులుగా, శత్రువులుగా భావించడంలోనే ప్రమాదం ఉంది. ఇవాళ సమస్యల్లా ఇలాంటి భావజాలమే.

ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీయైనా తన భావజాలాన్ని ప్రచారం చేసుకోవచ్చు. కాని ప్రతిపక్ష పార్టీలని రాజ్య యంత్రాంగాన్ని ఉపయోగించి భయభ్రాంతులకు గురిచేయడం గతంలో ఇందిరాగాంధీ పాలనలో కొంత జరిగినా, బిజెపితో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఆ ధోరణులకు అడ్డుకట్ట వేయగలిగారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని నడిపిస్తున్న శక్తులు తాము ఏది చేసినా, చట్టబద్ధ పాలనను ఖాతరు చేయకపోయినా, తాము ద్వేషించే వారి మీద ఏ దాడి చేసినా తమకు పూర్తి రక్షణ ఉంటుందనే బలం దీర్ఘకాలంలో చట్టబద్ధ పాలనకు ప్రమాదమే కాక, చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటే సమాజం అన్ని సమూహాలు క్రమక్రమంగా అదే మార్గం పడితే ఇక మిగిలేది ఒక అరాచక వ్యవస్థే.

ఈ చారిత్రక నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలను చూడవలసి ఉంటుంది. గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామిక విలువలతో కూడిన పార్టీ అని ఎవ్వరూ అనుకోవడం లేదు. అయితే ఆ పార్టీకి మద్దతిస్తున్న శక్తులు ద్వేషభావజాలంతో మండిపోతున్నవి కావు. వాళ్లు కొంతైనా రాజ్యాంగ విలువలను గౌరవిస్తారని, మెరుగైన పాలనను అందిస్తారని, ప్రజల సంక్షేమం గురించి కొంత పట్టించుకుంటారని కర్ణాటక సమాజం భావించింది. ఐదు సంవత్సరాలుగా కర్ణాటక సమాజం ఎదుర్కొన్న శాంతిభద్రతల సమస్య, మతపర ద్వేషం కర్ణాటకలోని పెట్టుబడిదారీ శక్తులకు కూడా సమస్యాత్మకమైంది. ఒక దశలో పారిశ్రామిక సంస్థలు, ఐటి రంగం, తాము బెంగళూరు నుంచి చెన్నై లేదా హైదరాబాద్‌కు తమ పరిశ్రమలను తరలిస్తామని హెచ్చరించారు. నిజానికి భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడికి, సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాకి కాంగ్రెస్‌ పార్టీ కంటే ఎక్కువ మద్దతు ఇవ్వడమే కాక, వాళ్లు కోరుకున్న అన్ని రాయితీలను కల్పించింది. ఈ రాయితీలతో పాటు పెట్టుబడి ఒక సామరస్య, సౌభ్రాతృత్వ సమాజాన్ని కోరుకుంటుంది. ఈ అభివృద్ధి నమూనా తీవ్రమైన అసమానతలకు దారితీసినప్పుడు అనివార్యంగా సమాజంలో అసంతృప్తి పెరుగుతుంది. ఈ అసంతృప్తిని ఎదుర్కొనడానికి అధికార పార్టీ ఎన్నుకున్న మార్గాన్ని కర్ణాటకలోని కార్పొరేట్‌ శక్తులు హర్షించలేదు. భారతీయ జనతా పార్టీ ఈ వైరుధ్యంలో చిక్కుకుంది.

కర్ణాటక సమాజానికి ఒక సుదీర్ఘమైన ప్రజాస్వామ్య, ఉదారవాద సంస్కృతి, సంస్కారం ఉంది. బసవన్న ఆలోచనాధార, నిచ్చెనమెట్ల సమాజాన్ని ప్రశ్నించి సామాజిక న్యాయభావనకు బలమైన బీజాలు వేసింది. ఆ తర్వాత ఎంతోమంది కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, సినిమా స్రష్టలు దాకా బసవన్న ఆలోచనాధారని సుసంపన్నం చేశారు. ఈ ఆలోచనాధార నుంచే దేవనూరు మహాదేవ లాంటి అద్భుత రచయిత ఎదిగారు. సమకాలీన కర్ణాటక సమాజంలో ఆయన ప్రభావం దళితశక్తుల మీదే కాక అన్ని ప్రజాస్వామ్య శక్తుల మీద విస్తృతంగా ఉంది. ఆయన జీవన శైలి చూస్తే నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత మనను ఆకట్టుకుంటాయి. ఈ నైతిక శక్తి వలన ఆయన రాసిన ‘‘ఆర్‌ఎస్‌ఎస్‌: దాని లోతుపాతులు’’ అనే పుస్తకం లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. తన పుస్తక ప్రచురణ హక్కుని తెలంగాణలో కాళోజీ లాగే ప్రజలకు ఇచ్చారు. ఈ పుస్తక ప్రభావం కర్ణాటక సమాజం మీద, ఎన్నికల మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పడింది. సమాజంలో ద్వేష రాజకీయాలు పుంజుకున్నప్పుడు కవులు, రచయితలు ఎలాంటి పాత్ర నిర్వహించాలో ఆయన నుంచి నేర్చుకోవలసి ఉంటుంది.

ప్రజాస్వామ్య వారసత్వం వల్ల కర్ణాటకలో ఒక సజీవమైన పౌరసమాజం ఉంది. ఈ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పౌరసమాజ ఛాయలు కూడా కనిపించవు. పౌర సమాజంలో పని చేస్తున్న 102 ప్రజాసంఘాలు తమ విభేధాలను పక్కకు పెట్టి అందరూ కలిసికట్టుగా గత ఆరు నెలలుగా రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. వాళ్ళు చేసిన కృషి నమ్మశక్యం కాని ఎత్తులో ఉంది. వాళ్లు ఎడ్డురే కర్ణాటక, మేలుకో కర్ణాటక అనే నినాదం చేపట్టారు. వాళ్లు 250 వర్క్‌షాప్స్‌, 103 నియోజకవర్గాల్లో, 192 బృందాలుగా ఏర్పడి, ఐదువేల మంది కార్యకర్తలు పనిచేశారు. వీళ్లు నలభై ఒక్కవేల కుటుంబాల వివరాలు సేకరించారు. 650 పోస్టర్స్‌, ఎనభై వీడియోలు, ఏడు ఆల్బమ్‌లను విడుదల చేశారు. పది లక్షల కరపత్రాలను పంచారు. అంతేకాక చిన్న చిన్న పార్టీల నుంచి పోటీ చేస్తున్న 49 మంది అభ్యర్థులను పోటీ నుంచి విరమించుకునేలా ఒప్పించారు. వంద విలేఖరుల సమావేశాలు నిర్వహించారు. యాభై ధర్నాలు (రైతులు, కార్మికులు, దళితులు, స్త్రీలు, విద్యార్థులు, ఆదివాసీలతో) నిర్వహించారు. మొత్తంగా 31 జిల్లాలలో 151 తాలూకాలలో ప్రచారం చేశారు.

ఈ వివరాలు చూసిన ఎవరికైనా ఆశ్చర్యం వేయక తప్పదు. భారతీయ జనతాపార్టీ విజయంలో చాలా అంకితభావంతో పనిచేసే వేలాది కార్యకర్తలున్నారు. ఏ ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఇలాంటి కార్యకర్తలు లేరు. ఆ పార్టీ బలమంతా ఈ కార్యకర్తలే. వారి కృషికి సమానస్థాయిలో కర్ణాటకలో ఈ ప్రజాసంఘాల కార్యకర్తలు పనిచేశారు.

కర్ణాటక చేసిన ఈ ప్రయోగం చాలా విలువైనది. వాళ్లు ఎక్కడా ఫలానా పార్టీకి ఓటు వేయండి అని ప్రచారం చేయలేదు. విద్వేష రాజకీయాలకు మద్దతు ఇవ్వకండి అని మాత్రమే ప్రచారం చేశారు. ఎక్కడా భారతీయ జనతా పార్టీ పేరు కూడా తీసుకోలేదు. ఎన్నికల రాజకీయాలకు బయట పనిచేశారు. వాళ్లు చేసిందల్లా పౌరసమాజ చైతన్యాన్ని పెంచడం. ప్రజాస్వామ్య సమాజాలు, దేశాల భవిష్యత్తును రాజకీయ పార్టీలకే వదలకూడదు. మనదేశంలో అమలులో ఉన్న అభివృద్ధి నమూనా నిర్బంధం లేకుండా అమలుచేయడం సాధ్యం కాదు. కాంగ్రెస్‌ పార్టీ కాలంలో కూడా ఎన్నో నిర్బంధ చట్టాలు వచ్చాయి. భిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యవహారశైలిలో ఈ నియంతృత్వ ప్రవర్తన చూడవచ్చు. ఈ అభివృద్ధి స్వభావమే అలాంటిది. దీనికి తెలంగాణయే పెద్ద ఉదాహరణ. ఒక సామాజిక ఉద్యమం నుంచి ఆవిర్భవించిన పార్టీ ప్రవర్తన మిగతా పార్టీలకు భిన్నంగా లేదు. ఇలాంటి చారిత్రక సందర్భంలో ఏ సమాజంలోనైనా ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడం చైతన్యవంతమైన సమాజానికే సాధ్యం. అలాంటి సమాజ నిర్మాణమే ఇవాళ దేశభవిష్యత్తు గురించి మధనపడే వాళ్ల సామాజిక, చారిత్రక బాధ్యత.

ప్రొ. జి. హరగోపాల్‌ 


Wednesday 25 January 2023

లోకేశ్‌ పాదయాత్రకు పోలీసుల నిబంధనలు

 లోకేశ్‌ పాదయాత్రకు పోలీసుల నిబంధనలు

ABN , First Publish Date - 2023-01-25T02:31:26+05:30 IST


నాడు.. సరిగ్గా ఐదేళ్ల కిందట... టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేశారు.


Lokesh Padayatra: లోకేశ్‌ పాదయాత్రకు పోలీసుల నిబంధనలు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్

సం|| 93979 79750


లోకేశ్‌ పాదయాత్రకు పోలీసుల నిబంధనలు


తేడా వస్తే అనుమతులు రద్దు


15 షరతులు విధించిన పలమనేరు డీఎస్పీ



Powered By

VDO.AI


పంచాయతీ రోడ్లపైనా సభలు పెట్టొద్దు


తొలి మూడు రోజులకు మాత్రమే అనుమతి


నాడు రాష్ట్రస్థాయిలో జగన్‌ యాత్రకు అనుమతి


మూడంటే మూడు నిబంధనలతో జగన్‌ యాత్ర


నేడు అడుగడుగునా ఆంక్షలు, షరతులు


సబ్‌డివిజన్‌లవారీగా దరఖాస్తు తప్పదు


ఆంక్షలపై టీడీపీ నేతల్లో విస్మయం


అందరి యాత్రల్లాగే సాగుతుంది: టీడీపీ నేతలు


(అమరావతి/చిత్తూరు - ఆంధ్రజ్యోతి): నాడు.. సరిగ్గా ఐదేళ్ల కిందట... టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేశారు. అప్పుడు ఆయన పాదయాత్రకు పోలీసులు మూడంటే మూడు నిబంధనలతో అనుమతి ఇచ్చారు. పాదయాత్రలో ఊరూరా తిరిగిన జగన్‌ హామీల వర్షం కురిపించి, చంద్రబాబు పాలనపై ఆరోపణలు గుప్పించి అధికారంలోకి వచ్చారు.


నేడు..


ఈనెల 27వ తేదీ నుంచి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ యువనేత నారా లోకేశ్‌ పాదయాత్ర తలపెట్టారు. ‘యువగళం’ పేరుతో కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు... 400 రోజులు 4000 కిలోమీటర్లు నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ యాత్రకు అనుమతి ఇస్తున్నదీ, లేనిదీ చెప్పకుండా పోలీసులు సోమవారం దాకా నాన్చారు. మంగళవారం చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ ఎన్‌.సుధాకర్‌ రెడ్డి ఈ యాత్రకు అనుమతి ఇచ్చారు. అదీ... అనేక షరతులతో! ‘గీత దాటితే అనుమతులు రద్దు చేస్తాం’ అని సూటిగా చెప్పారు. ఈ అనుమతులు కూడా పలమనేరు సబ్‌డివిజన్‌ పరిధికి మాత్రమే వర్తిస్తాయి. ఆ తర్వాత మరో డీఎస్పీ నుంచి అనుమతి తీసుకోవాలి. అప్పట్లో జగన్‌కు డీజీపీ స్థాయిలో రాష్ట్రమంతా పాదయాత్ర చేసుకోవడానికి ఒకేసారి అనుమతి లభించగా... ఇప్పుడు లోకేశ్‌ పాదయాత్రకు డీఎస్పీ స్థాయి అధికారులతో ఎక్కడిక్కడ అనుమతులు తీసుకోవాలనడం గమనార్హం. లోకేశ్‌ పాదయాత్రకు పలమనేరు డీఎస్పీ ఏకంగా 15 షరతులు విధించారు. అవి చూసి టీడీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది రెండు కాళ్లూ కట్టేసి, ఇక నడవండి అన్నట్లుగా ఉందని మండిపడుతున్నారు.


అడ్డంకులు సృష్టించేందుకే..


లోకేశ్‌ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడానికి పోలీసుల ద్వారా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పట్టించుకోరాదని టీడీపీ నిర్ణయించుకుంది. ఆంక్షలపై పార్టీ సీనియర్లు చర్చించుకున్నారు. గతంలో ఏ పాదయాత్రకూ ఇలాంటి షరతులు విధించలేదని, ఇందులో రాజకీయ దురుద్దేశం ఉందని అభిప్రాయపడ్డారు. ‘గతంలో పాదయాత్రలు ఎలా జరిగాయో ఇదీ అలాగే జరుగుతుంది. పోలీసుల పేరుతో షరతులు పెట్టి ఆటంకాలు కలిగించాలని చూసినా వాటిని మేం పట్టించుకోదల్చుకోలేదు. మేమెలా అనుకున్నామో అలాగే వెళ్తాం. ఇది మా పార్టీ నిర్ణయం’ అని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘జగన్‌ ఎలా పాదయాత్ర చేశారో లోకేశ్‌ కూడా అలాగే చేస్తారు. అడ్డుపడాలని చూస్తే ప్రతిఘటిస్తాం. ప్రభుత్వం అడ్డుపడితే ప్రజలు మరింత మంది వస్తారు. వైసీపీ తన గొయ్యి తాను తవ్వుకొంటే మేమేం చేస్తాం’ అని మరో నాయకుడు అన్నారు. ఇంకోవైపు.. ఈ సుదీర్ఘ పాదయాత్రకు అటు లోకేశ్‌, ఇటు టీడీపీ నేతలు, కార్యకర్తలు పూర్తి స్ధాయిలో సన్నద్ధమవుతున్నారు.


తాను ఒక ఏడాదిపాటు ఇంటికి వచ్చేది లేదని భార్య బ్రాహ్మణికి, కొడుకు దేవాన్ష్‌కు లోకేశ్‌ చెప్పారు. ఆయన బృందాల్లో ఒకటి ఈ యాత్రకు సంబంధించి వాహనాలు, రాత్రి బస, భోజన వసతి, సెక్యూరిటీ తదితర అంశాలు చూసుకొంటోంది. మరో బృందం ఈ యాత్రలో లేవనెత్తాల్సిన అంశాలు, ప్రజల నుంచి వినవచ్చే సమస్యలు, వివిధ వర్గాలతో జరిపే సమావేశాల్లో చెప్పాల్సిన విషయాలపై కసరత్తు చేస్తోంది. మరో బృందం యాత్ర పొడవునా పార్టీ నేతలతో సమన్వయ బాధ్యతలు నిర్వహించే పని నిర్వర్తిస్తోంది. ఈ యాత్రలో లోకేశ్‌ సుమారు నూట పాతిక అసెంబ్లీ నియోజకవర్గాలు సందర్శించనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున మూడు రోజులు యాత్ర కొనసాగుతుంది.


నేడు లోకేశ్‌ పాదయాత్రకు...


లోకేశ్‌ పాదయాత్రకు అనుమతి ఇస్తూ చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ ఎన్‌. సుధాకర్‌ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఏకంగా పదిహేను నిబంధనలు పెట్టారు. ఈ అనుమతి కూడా తన పరిధిలో ఉన్న ప్రాంతం వరకూ మాత్రమే ఇచ్చారు.


1) ఈ అనుమతి ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం ఆరు వరకే వర్తిస్తుంది. (పలమనేరు సబ్‌డివిజన్‌ పరిధిలో మాత్రమే)


2) శాంతి భద్రతలకు, శాంతికి భంగం వాటిల్లే పరిస్థితులు ఉత్పన్నమైతే ఈ అనుమతిని ముందస్తు సమాచారం కూడా లేకుండా రద్దు చేయవచ్చు లేదా సవరించవచ్చు.


3) జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల మీద సభలు పెట్టరాదు. అత్యవసర సర్వీసులు, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం కలిగించరాదు. ఇరుకుగా ఉన్నందువల్ల మునిసిపల్‌ రోడ్లు, పంచాయితీరాజ్‌ రోడ్లపై కూడా సభలు పెట్టరాదు. సభ పెట్టాల్సి వస్తే విడిగా ఒక స్థలం చూసుకోవాలి. తగినంత ముందుగా దాని గురించి సంబంధిత డీఎస్పీకి తెలియజేసి ముందస్తు అనుమతి పొందాలి.


4)పాదయాత్ర లేదా రోడ్‌ షోను బహిరంగ సభగా మార్చరాదు.


5) పాదయాత్ర సందర్భంగా వివిధ వర్గాల వారితో నిర్వహించే సమావేశాలు బహిరంగ సభల మాదిరిగా నిర్వహించరాదు. రోడ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఇటువంటి సమావేశాల్లో మైక్‌ ఉపయోగించాలంటే ముందుగా పోలీస్‌ అనుమతి తీసుకోవాలి. బహిరంగ సభ మాదిరిగా నిర్వహించాలనుకుంటే సంబంధిత డీఎస్పీ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి. బహుళ ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ మార్గాలున్న ప్రదేశాలను వీటికి ఎంపిక చేసుకోవాలి.


6) పాదయాత్ర లేదా రోడ్‌ షో మొత్తం రహదారిని మూసివేయకుండా చూడాలి. రోడ్డుపై ప్రజలు, ట్రాఫిక్‌ ప్రయాణించడానికి ఆటంకాలు లేకుండా చూడాలి.


7) అనుమతించిన సంఖ్యకన్నా ఎక్కువ వాహనాలు పాదయాత్రలో వినియోగించకుండా జాగ్రత్త వహించాలి. 8)రద్దీని నివారించడానికి, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూడటానికి, ప్రజల రక్షణ నిమిత్తం తగినంత సంఖ్యలో మహిళా, పురుష వలంటీర్లను పెట్టుకోవాలి. వలంటీర్లు అందరూ యూనిఫాం వేసుకోవాలి. రద్దీని అదుపు చేయడానికి తాళ్ళు కూడా చాలినంత సంఖ్యలో పెట్టుకోవాలి.


9) ముందుగా తెలిపిన దారి, సమయాలను పాటించాలి.


10) పాదయాత్రలో డీజే సిస్టమ్‌, లౌడ్‌ స్పీకర్లు వాడటానికి వీల్లేదు. తక్కువ శబ్దం వచ్చే సింగిల్‌ సౌండ్‌ బాక్స్‌ సిస్టం మాత్రమే వాడాలి. ఎక్కడైనా ఆగిన చోట మాత్రమే మైక్‌ వాడాలి.


11) పాదయాత్రలో పాల్గొనేవారు మారణాయుధాలు, రాళ్ల వంటివి ఉంచుకోకూడదు. మద్యం వాడకం నిషేధం. బాణాసంచా పేల్చరాదు.


12) నిబంధనల ప్రకారమే డ్రోన్లు, ఫ్లైయింగ్‌ కెమెరాలు వాడాలి.


13) పాదయాత్రలో పాల్గొనే వారి రక్షణకు నిర్వాహకులు పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఒక అంబులెన్సు సిద్ధంగా ఉండాలి. రాత్రి బస చోట బారికేడ్లు, సరిపోను లైట్లు పెట్టాలి. ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


14) పాదయాత్రకు హాజరయ్యే వారి వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలగకుండా నిర్వాహకులు జాగ్రత్త తీసుకోవాలి.


15) పైనిబంధనలన్నింటికీ కట్టుబడి ఉంటామని, వాటిని ఉల్లంఘిస్తే తమదే బాధ్యత అని నిర్వాహకులు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలి. వీటిని పాటించకపోతే పాదయాత్ర అనుమతిని రద్దు చేయడానికి, న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులకు హక్కు ఉంటుంది. 1861 పోలీస్‌ చట్టంలోని సెక్షన్‌ 30లోని ఒకటి, రెండు, మూడు, నాలుగు అంశాల కింద ఈ అనుమతి ఇస్తున్నట్లు అందులో తెలిపారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ పేరుతో ఈ అనుమతి జారీ అయింది.


నేడు కడప దర్గాకు లోకేశ్‌


తిరుపతి/అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ నేటి రాత్రికి తిరుమల రానున్నారు. 27న కుప్పం నుంచి సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన మూడు ప్రసిద్ధ ప్రార్థనా స్థలాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు, పూజలు జరపనున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులు అర్పించి విమానంలో కడప చేరుకుంటారు. అక్కడ ప్రఖ్యాత అమీన్‌పీర్‌ దర్గాను, ప్రసిద్ధ రోమన్‌ కేథలిక్‌ చర్చిని సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు కడప నుంచి బయల్దేరి రాత్రి 10గంటలకు తిరుమల చేరుకుంటారు. రాత్రికి అక్కడే జీఎంఆర్‌ గెస్ట్‌హౌ్‌సలో బస చేస్తారు. గురువారం ఉదయం కుటుంబంతో కలసి శ్రీవారిని దర్శించుకుని 10.30కు కుప్పం వెళ్లి అక్కడ బస చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం వరదరాజుల స్వామి ఆలయంలో పూజలతో యాత్ర ప్రారంభమవుతుంది. కుప్పంలో సభ నిర్వహిస్తారు.


రక్షణ కల్పించాల్సింది పోయి ఆంక్షలా: అచ్చెన్న?


జగన్‌రెడ్డి పర్యటనలకు ముళ్ల కంచెలు పెట్టి మరీ రక్షణ కల్పిస్తున్న పోలీసులు.. లోకేశ్‌ పాదయాత్రకు ఆంక్షలు విధిస్తారా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. యువగళం పాదయాత్రపై ప్రభుత్వ ఆంక్షలు జగన్‌రెడ్డి అభద్రతాభావానికి అద్దం పడుతున్నాయని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. లోకేశ్‌ పాదయాత్ర ప్రకటన చేసినప్పటి నుంచే వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ‘ప్రతిపక్ష నేతలకు పాదయాత్ర చేసే హక్కు లేదా? నాడు చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తే జగన్‌రెడ్డి పాదయాత్ర చేసేవారా? ఎన్ని కుట్రలు పన్నినా లోకేశ్‌ పాదయాత్రను అడ్డుకోలేరు’అని అన్నారు.


అవి సాధారణ నిబంధనలే!


మా నుంచి అన్నివిధాలా సహకారం


‘ఆంధ్రజ్యోతి’తో చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి


‘‘లోకేశ్‌ పాదయాత్రకు మేం సూచించిన నిబంధనలన్నీ చాలా సాధారణమైనవే. ఆంక్షలతో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని అనవసరంగా కొందరు వదంతులు సృష్టిస్తున్నారు. ఆయన పాదయాత్రకు మా శాఖ నుంచి అన్నివిధాలా భద్రత, సహకారం ఉంటుంది’’ అని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘చిత్తూరు జిల్లాలో లోకేశ్‌ పాదయాత్ర మొత్తం నేషనల్‌ హైవే మీదుగా సాగుతుంది. హైవే మీద ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించినా అందరూ ఇబ్బంది పడతారు. పాదయాత్రకు ఇబ్బంది కలిగించాలనే ఆలోచన మాకు లేదు. వీలైనంత వరకు అన్ని విధాలుగా సహకరిస్తాం. అవసరమైన భద్రత కల్పిస్తాం. ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్ర వివరాలను ఎప్పటికప్పుడు అందించి, అనుమతులు తీసుకోవాలి. ప్రస్తుతానికి కుప్పం కార్యక్రమాలకు అనుమతులిచ్చాం. పాదయాత్ర సాగే రెండో నియోజకవర్గం పలమనేరు షెడ్యూల్‌ ఇంకా ఇవ్వలేదు.


జిల్లా మొత్తం ఇవే నిబంధనలతో మంజూరు చేస్తాం’’ అని ఎస్పీ వివరించారు. ఏవైనా కార్యక్రమాలు చేపడితే... నిర్వాహకులు కొంత బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పోలీసు శాఖ తరఫున తాము కూడా బాధ్యత వహించి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ‘‘పాదయాత్రకు అవసమైన పూర్తిస్థాయి భద్రత ఇస్తాం. టీడీపీ నాయకులు ఎన్ని వాహనాలకు అనుమతి కోరారో, అన్నింటికీ అనుమతి ఇచ్చేశాం. ఉద్దేశపూర్వకంగా వాహనాల సంఖ్యను తగ్గించలేదు’’ అని స్పష్టం చేశారు.


Tuesday 26 January 2016

Notes on Communists

కమ్యూనిస్టులు వేరు
కమ్యూనిస్టు పార్టీ సభ్యులు వేరు

అవసరమైనవాళ్ల ద్వార కాకుండా  అవసరం లేనివాళ్ల ద్వార
భారత దేశంలోనికి కమ్యూనిజం  వచ్చింది.

కమ్యూనిజం అవసరమైనవాళ్ళు
దాన్ని  స్థానిక అవసరాలకు అనువుగా
సృజనాత్మకంగా అన్వయిస్తారు

కమ్యునిజం అవసరంలేనివాళ్ళు
అతివాదం పేరుతో
కమ్యూనిజాన్ని జడపదార్ధంగా మారుస్తారు

అణగారిన వర్గాల మధ్య అనేక వైరుధ్యాలున్నమాట వాస్తవం. అయినప్పటికీ అణగారినతనం వాళ్లను ఏకం చేస్తుంది. కలిసిపోరాడడం నేర్పుతుంది. ఐక్యత సందర్భం అయినప్పుడు వైరుధ్యాల గురించి మాట్లాడేవాడు మూర్ఖుడు.



Monday 25 January 2016

ఇళ్లు వాకిళ్లు వదులుకోలేం..

ఇళ్లు వాకిళ్లు వదులుకోలేం..
25-01-2016 06:24:55

  • ఎక్స్‌ప్రెస్‌హైవే తమ ఇళ్ల మీదుగా ఉంటుందని ఆందోళన 
  •  సమావేశం నిర్వహించిన తుళ్లూరు రైతులు , గ్రామస్తులు 
  •  మ్యాప్‌ను మార్చుకోవాలంటూ హెచ్చరిక
తుళ్ళూరు: మా గృహాలకు ముప్పు వాటిల్లకుండా రోడ్లు వేసుకోండి, కాని మా ఇళ్లు, వాకిళ్ల జోలికి మాత్రం రావద్దని తుళ్ళూరు రైతులు పేర్కొన్నారు. అందరిదీ ఒకే మాటగా తీర్మానించుకున్నారు. ఎక్స్‌ప్రెస్‌ హైవే తుళ్ళూరుకి తూర్పు, దక్షిణ భాగంలో ఇళ్ల మీద నుంచి వెళుతున్నట్లు తెలియటంతో, రైతులు ఆదివారం రావెల సుబ్బారావు ఆవరణలో సమావేశం అయ్యారు. పొలాలతో పాటు ఇళ్లు వదులుకోవటానికి సిద్ధంగా లేమని సమావేశంలో రైతులు, గ్రామస్తులు పేర్కొన్నారు. తాతల ముత్తాతల కాలం నుండి నివాసాలుండే వాటిని ఖాళీ చేయించాలని చూస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. మేమిచ్చిన పొలాలు ఉన్నాయి... వాటిల్లో నుంచి మీరు ఏ రోడ్డు వే సుకున్నా మాకు అభ్యంతరం లేదని వారు సమావేశంలో పేర్కొన్నారు. దాదాపు రెండు వందల మంది నివాసాల వారు సమావేశానికి హాజరయ్యారు. ఎటువంటి తమకెవరికీ రోడ్డు వేయానికి ఇష్టం లేదని సూచించారు. కనుక మ్యాప్‌లో ఉన్న ఎక్స్‌ప్రెస్‌ వేలను మార్చుకోవాలని అన్నారు. కాదని ఇళ్ళ జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక చేశారు.

Sunday 24 January 2016

Discourse with Revolutionary Writers Association

విరసం ( రివేర) సంవాదం

హైదరాబాద్‍
25 - 1-2016

రివేరాగారూ !

విరసం విజయవాడ సమావేశంలో  మీ  ప్రసంగంలో  పౌరసమాజాన్ని ప్రస్తావించారని తెలిసింది. వర్తమాన సమాజంలో పౌరసమాజం పనికిరాదని మీరు పేర్కొన్నట్టు మీ ప్రసంగాన్ని విన్నవారు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం కన్వీనర్ గా నేను దీని మీద స్పందించాల్సి వున్నది.  విరసంతో నేను ఇప్పటి వరకు సౌభ్రాతృత్వాన్ని కొనసాగిస్తున్నాను గనుక  మీ అభిప్రాయం మీద స్పందించడానికి  ముందు అసలు మీరు ఏమన్నారో మీ నుండే  తెలుసుకోవాలనుకుంటున్నాను. మూడు అంశాలను మీరు స్పష్టం చేయగలరు.

1. పౌరసమాజం పనికి రాదని చెప్పాల్సిన అవసరం మీకు విజయవాడ మహాసభలో ఎందుకు వచ్చింది?
2. పౌరసమాజం గురించి మీ అభిప్రాయం ఏమిటీ?
3. ఇది మీ అభిప్రాయమా? విరసం అభిప్రాయమా?

రెండు రోజుల్లో మీరు ఈ వివరణ ఇవ్వని పక్షంలో నేను విన్నది నిజమని భావించి దాని మీద స్పందిస్తాను.


అసంఖ్యాక పీడిత వర్గాలకు ముప్పువున్న ప్రస్తుత తరుణంలో వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసంఖ్యాక సంఘాలు, వ్యక్తుల మధ్య సౌభ్రాతృత్వ సంబంధాలు వుండాలని నేను భావిస్తున్నాను. అలాకాకుండా, ఘర్షణ సంబంధాలు వుండాలని మీరు భావిస్తే దానికీ నేను  సిధ్ధమే.

ఏం యం ఖాన్ యజ్దానీ (డానీ)

కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం.

Posted : 11.37 a.m.


11:56am
Varalakshmi Virasam
I couldn't hear to his speech completely as I was called by media persons. Getting the audio and video.
Present rivera is unavailable even on phone. I don't think he meant it (first point). Regarding his speech the approach and the theoretical depth is appreciated, at the same time, some differences  are also expressed. Pani who was presiding mentioned it.


12.. 09 p.m.
Subbaraju Chi
Anna, Your approach of ascertaining the fact from the speaker himself is a very reasonable, respectable and a confidence building measure. You have raised the bar of democratic discourse and decorum. I appreciate your gesture and second you as our leader.



3:05PM
Varalakshmi Virasam

Sir, విన్న వాళ్ళ నుండి clarify చేసుకున్నాను.
పౌరసమాజమా, వర్గసమాజమా అంటే మనది వర్గ సమాజం అని చెప్పాలి. మావోయిస్టులుగా మేమిది వర్గసమాజం అని చెప్తాం. రివేరా అన్నది ఇది. వర్గ దృష్టిని ఆయన emphasize చేశారు. ఇది మీ సంస్థ పౌరసమాజం గురించి గాని, సాధారణ అర్థం లో వాడే పౌరసమాజం గురించి గాని అన్నది కాదు. గమనించగలరు.  మా ప్రసంగ పాఠాలన్నీ అరుణతారలో వేస్తున్నాం. వీడియో విరసం  సైట్ లో అందరికీ అందుబాటులో  ఉంచబోతున్నాం. మీ సూచనలు ఆహ్వానిస్తున్నాం.
.. వరలక్ష్మి






Hydearbad
27-1-2016

రివేరాగారూ !

మీ వివరణ కోసం రెండు రోజుల గడువు ఇచ్చాము. దాన్ని ఇంకో మూడు రోజులు పోడిగించాము. అయినా మీరు స్పందించలేదు. రాళ్ళు వేయడమేతప్ప సంవాదం మీ విధానం కాదనుకుంటా!. ఇక విరసం మీద బహిరంగ ప్రకటన చేయడంతప్ప మాకు మరో మార్గం లేదు.

మీరు ఒక వివాదానికి తెరతీశారు. నేను నాయకత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద కొన్ని విమర్శలు చేశారు. దానికి ఫేస్ బుక్,  విరసంలను వేదికగా  వాడారు. అందువల్ల ఈ వివాదం  వ్యక్తిగతం కాకుండా సంస్థాగతంగా మారింది. మీ విమర్శలో రెండు విభాగాలున్నాయి. మొదటిది, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ప్రాసంగికత గురించి. రెండోది హిందూత్వ ఆచరణ గురించి. రెండవదయిన  హిందూత్వ అంశం  ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం పరిధిలోనిదికాదు కనుక దాన్ని విడిగా చర్చిస్తాను. ఇప్పటికి మనం ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద మీ విమర్శను పరిశీలిద్దాము.

కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో ప్రజల అవసరాలు, కోరికలకూ, ప్రభుత్వ పనితీరుకూ,  ఆబ్లిగేషన్లకూ మధ్య దూరం  పరీతంగా పెరిగిపోతున్నదనీ, దాన్ని పూరించడానికి పౌరసమాజం పూనుకోవాలనే నిరాడంబర లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఆవిర్భవించింది. ఇది కొత్త అన్వయం, కొత్త సంస్థ, ఇంకా సన్నాహక దశలోనేవుంది.

విరసం ప్రకటిత లక్ష్యం పీడిత ప్రజల పక్షాన నిలబడడం కనుక దాన్ని మేము సోదర సంస్థగా భావిస్తాము. గొప్ప ప్రజాకవి, ఆలోచనాపరుడు మాత్రమేగాక వ్యక్తిగతంగానూ నాకు ఆత్మీయులు అయిన వరవరరావు  విరసంలో వుండడంవల్ల కూడా ఆ సంస్థ మీద మాకు అపార గౌరవంవుంది.

ఐక్యసంఘటన సాగించాల్సిన చారిత్రక సందర్భంలో  వివాదాన్ని మీరు మొదలెట్టారు. ఫేస్ బుక్ లోని మా వాల్ లోనికి వచ్చి నన్నూ, నేను ప్రాతినిధ్యం హిస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌరసమాజాన్నీ ఎద్దేవ చేశారు. పౌరసమాజం  కన్వీనర్ గా మారాక కందమూల ఫలాలు, ఆకులూ అలములు తింటున్నానుగానీ స్వతహాగా నేను మాంసాహారినే. అది మీకూ తెలుసు.  మీరు నామీదా, నా సంస్థ మీద బహిరంగంగా చేసిన విమర్శకు ప్రతిగా నేను మీమీదా, మీ సంస్థ  మీదా  ఆ క్షణంలోనే బహిరంగ విమర్శ చేయాలి. నేనూ, నా సంస్థ పనికిమాలినవాళ్ళం అని మీరు అనగలిగినపుడు మీరూ, మీ సంస్థా  పనికిమాలినవి అనడానికి ఎంతసేపు పడుతుందీ? కేవలం వరవరరావు మీద గౌరవంతో నేను ఆ పనిచేయలేదు. నేను పాటించిన ఒక వున్నత సాంప్రదాయాన్ని మీరు నా బలహీనతగా భావించారు.

ప్రజాస్వామిక విలువల్నీ, ఐక్యసంఘటన ధర్మాన్నీ  పాటిస్తూ నేను మీకు ఫోన్ చేసి మీకున్న అభ్యంతరం ఏమిటీ? అని అడిగాను. మాతో మీకు సైధ్ధాంతిక విబేధాలున్నాయనీ, వాటి గురించి ఫోనుల్లో కాకుండా సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం వుందన్నారు. నాకు తెలుసు మీరు సమగ్ర వాదనకు నిలబడరని. మీరు ప్రకటిత ’మావోయిస్టులు” కదా! మేధోరంగంలోనూ గెరిల్లా యుధ్ధాలు చేస్తారు. హిట్ అండ్ రన్!

ఆ తరువాత విరసం విజయవాడ మహాసభల ప్రసంగంలో (జనవరి 10) మీరు  పౌరసమాజాన్ని ప్రస్తావించి విమర్శించారు.  మామీద మీ దాడిని సమర్థించుకోవడానికి  ఆంటోనియో గ్రామ్ స్కీ ని విమర్శించారు. ఇటలీలో కమ్యూనిస్టు పార్టీల మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని భావించిన  తరువాత గ్రామ్ స్కీ పౌరసమాజం భావనకు ప్రాణం పోశాడు. తార్కికంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో డానీ పౌరసమాజాన్ని ఆరంభించాడంటే అక్కడి  ప్రజలు కమ్యూనిస్టు పార్టీలని చీదరించుకున్నారనే అర్ధం వస్తుందని మీ భయం. చరిత్రకు కొత్త సూత్రాలేమీ వుండవు పాతసూత్రాలే పనిచేస్తుంటాయి.

రెండవసారి మీరు దాడి చేశారని తెలిశాక కూడా మేము తొందరపడలేదు. పరిస్థితిని సమీక్షించడానికి ఇంకో రెండు వారాలు ఆగాము.  అసంఖ్యాక పీడిత సామాజిక వర్గాలకు ముప్పువున్న ప్రస్తుత తరుణంలో వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసంఖ్యాక సంఘాలు, వ్యక్తుల మధ్య సోదర సంబంధాలు వుండాలనీ, సమస్యల  పరిష్కారం కోసం అందరం కలిసి ముందుకు సాగాలని  మేము భావిస్తున్నాము. మీ విమర్శ మీద స్పందించడానికి  ముందు అసలు  మీరు ఏమన్నారో మీ నుండే తెలుసుకోవాలను కున్నాను. 1. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం పనికి రాదని చెప్పాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది?  2. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం గురించి మీ అభిప్రాయం ఏమిటీ? 3. ఇది మీ అభిప్రాయమా? విరసం అభిప్రాయమా? అనే మూడు అంశాల మీద రాతపూర్వకంగా మీ వివరణ కోరాను. మీరు స్పందించలేదు.

మీ ఉపన్యాసాన్ని విందామని ఫేస్ బుక్ లో  https://www.facebook.com/arunatara.virasam వాల్ లోనూ, http://www.virasam.in/index.php వెబ్ సైట్‍ లోనూ వెతికాను. వాటిల్లో మీ ఉపన్యాసంతప్ప అందరి ఉపన్యాసాలూ వున్నాయి.  ఆ తరువాత విరసం కార్యదర్శి వరలక్ష్మీ, విరసం సభ్యులు  మరి కొందరితో నేను సంవాదం సాగించాను. వాళ్ల మెసేజులు, ఫోన్ సంభాషణలనుబట్టి మీరు మీ శక్తి మేరకు  ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద సైధ్ధాంతిక దాడి చేశారని తెలిసింది. "the approach and the theoretical depth is appreciated" అని మీ ఉపన్యాసాన్ని విరసం కార్యదర్శి మెచ్చుకున్నారు.  "మావోయిస్టులుగా మేమిది  వర్గసమాజం అని చెప్తాం. రివేరా అన్నది ఇది. వర్గ దృష్టిని ఆయన emphasize చేశారు." అని వారు ఒక వివరణ కూడా ఇచ్చారు.

వర్గము అనేది కమ్యూనిస్టు ప్రత్యయం, పౌరులు అనేది (పెట్టుబడీదారీ) ప్రజాస్వామ్య ప్రత్యయం అని మీరు వాదించి వుంటే నేను మిమ్మల్ని మెచ్చుకుని వుండేవాడిని.  అయితే ఈ విషయంలోనూ మీకు చిత్తశుధ్ధిలేదు. మావోయిస్టులయిన రచయితలు విరసాన్ని నడుపుతున్నట్టు, మావోయిస్టులయిన న్యాయవాదులు పౌరహక్కుల సంఘాన్ని నడుపుతున్నారన్న విషయాన్ని మీరు తెలివిగా మరచిపోయారు. మీరు పౌరులు అంటే అది విప్లవమూ! ఇతరులు పౌరులు అంటే అది వర్గ సంకర!! ఇలాంటి పిల్లచేష్టల కారణంగానే కమ్యునిస్టుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఛీ కొట్టారు!

అయితే, "ఇది మీ సంస్థ  పౌరసమాజం గురించిగానీ, సాధారణ అర్థంలో వాడే పౌరసమాజం గురించిగానీ అన్నది కాదు." అని విరసం కార్యదర్శి ఒక వింత వాదన చేస్తున్నారు. నిర్దిష్ట అర్ధమూ, సాధారణ అర్ధమూ కాకుండా మరో అర్ధం ఏముంటుందో  విరసం కార్యదర్శి వివరించాలి. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద మీ దాడిని విరసం ఆమోదించిందన్నదే ఇక్కడ కీలకం. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద విరసం దాడి చేసిందన్నదే ఇక్కడ ప్రాణప్రదమైన అంశం.

ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఎన్నడూ విరసం మీద దాడిచేయాలని అనుకోలేదు. విరసమే మహాసభల వేదిక సాక్షిగా ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద దాడి చేసింది. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఇప్పుడు కూడా విరసం మీద ప్రతిదాడి చేయాలని అనుకోవడంలేదు. ఇక ముందు విరసంతో సోదర సంబంధాలను వదులుకోవాలని మాత్రమే భావిస్తోంది.

శెలవు

ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం వర్ధిల్లాలి.

ఏం యం ఖాన్ యజ్దానీ (డానీ)
కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం.



Sir, pani metho matladanani chepparu..??



పాణీ నాతో మాట్లాడారు. విషయం ఏదైనాసరే  కాగితం మీద వుండడం మంచిదని నేను భావిస్తున్నాను.
నేను హిందూత్వ అంశం మీద వేరే లేఖ రాస్తాను.


విప్లవ రచయితల సంఘానికి
ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం
బహిరంగలేఖ

Hydearbad
27-1-2016

(ముందుగా చెప్పిన ప్రకారం మూడు రోజులు ఆగి ప్రకటిస్తున్నాం)

రివేరాగారూ !

మీ వివరణ కోసం రెండు రోజుల గడువు ఇచ్చాము. దాన్ని ఇంకో మూడు రోజులు పోడిగించాము. అయినా మీరు స్పందించలేదు. రాళ్ళు వేయడమేతప్ప సంవాదం మీ విధానం కాదనుకుంటా!. ఇక విరసం మీద బహిరంగ ప్రకటన చేయడంతప్ప మాకు మరో మార్గం లేదు.

మీరు ఒక వివాదానికి తెరతీశారు. నేను నాయకత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద కొన్ని విమర్శలు చేశారు. దానికి ఫేస్ బుక్,  విరసంలను వేదికగా  వాడారు. అందువల్ల ఈ వివాదం  వ్యక్తిగతం కాకుండా సంస్థాగతంగా మారింది.

కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో ప్రజల అవసరాలు, కోరికలకూ, ప్రభుత్వ పనితీరు,  ఆబ్లిగేషన్లకూ మధ్య అగాధం విపరీతంగా పెరిగిపోతున్నదనీ, దాన్ని పూరించడానికి పౌరసమాజం పూనుకోవాలనే నిరాడంబర లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఆవిర్భవించింది. ఇది కొత్త అన్వయం, కొత్త సంస్థ, ఇంకా సన్నాహక దశలోనేవుంది.

విరసం ప్రకటిత లక్ష్యం పీడిత ప్రజల పక్షాన నిలబడడం కనుక దాన్ని మేము సోదర సంస్థగా భావిస్తాము. గొప్ప ప్రజాకవి, ఆలోచనాపరుడు మాత్రమేగాక వ్యక్తిగతంగానూ నాకు ఆత్మీయులు అయిన వరవరరావు  విరసంలో వుండడంవల్ల కూడా ఆ సంస్థ మీద మాకు అపార గౌరవంవుంది.

ఐక్యసంఘటన సాగించాల్సిన చారిత్రక సందర్భంలో  వివాదాన్ని ముందు మీరు మొదలెట్టారు. ఫేస్ బుక్ లోని మా వాల్ లోనికి వచ్చి నన్నూ, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌరసమాజాన్నీ ఎద్దేవ చేశారు. పౌరసమాజం  కన్వీనర్ గా మారాక కందమూల ఫలాలు, ఆకులూ అలములు తింటున్నానుగానీ స్వతహాగా నేను మాంసాహారినే. అది మీకూ తెలుసు.  మీరు నామీదా, మాసంస్థ మీదా బహిరంగంగా చేసిన విమర్శకు ప్రతిగా నేను మీమీదా, మీసంస్థ  మీదా  ఆ క్షణంలోనే బహిరంగ విమర్శ చేయాలి. నేనూ, నా సంస్థ పనికిమాలినవాళ్ళం అని మీరు అనగలిగినపుడు మీరూ, మీ సంస్థా  పనికిమాలినవి అనడానికి ఎంతసేపు పడుతుందీ? కేవలం వరవరరావు మీద గౌరవంతో నేను ఆ పనిచేయలేదు. నేను పాటించిన ఒక వున్నత సాంప్రదాయాన్ని మీరు నా బలహీనతగా భావించారు.

ప్రజాస్వామిక విలువల్నీ, ఐక్యసంఘటన ధర్మాన్నీ  పాటిస్తూ నేను మీకు ఫోన్ చేసి మీకున్న అభ్యంతరం ఏమిటీ? అని అడిగాను. మాతో మీకు సైధ్ధాంతిక విబేధాలున్నాయనీ, వాటి గురించి ఫోనుల్లో కాకుండా సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం వుందన్నారు. నాకు తెలుసు మీరు సమగ్ర వాదనకు నిలబడరని. మీరు ప్రకటిత ’మావోయిస్టులు” కదా! మేధోరంగంలోనూ గెరిల్లా యుధ్ధాలు చేస్తారు. హిట్ అండ్ రన్!

ఆ తరువాత విరసం విజయవాడ మహాసభల (జనవరి 10) ప్రసంగంలో  మీరు  పౌరసమాజాన్ని ప్రస్తావించి విమర్శించారు.  మామీద మీ దాడిని సమర్థించుకోవడానికి  ఆంటోనియో గ్రామ్ స్కీ ని విమర్శించారు. ఇటలీలో కమ్యూనిస్టు పార్టీల మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని భావించిన  తరువాత గ్రామ్ స్కీ పౌరసమాజం భావనకు ప్రాణం పోశాడు. ఇటలీ అనుభవాన్ని  వర్తమానానికి  అన్వయిస్తే -  ఆంధ్రప్రదేశ్ లో డానీ పౌరసమాజాన్ని ఆరంభించాడంటే  అక్కడి  ప్రజలు కమ్యూనిస్టు పార్టీలని చీదరించుకున్నారనే తార్కిక అర్ధం వస్తుందని మీకు ముందుభయం వేసివుంటుంది. చరిత్రకు కొత్త సూత్రాలేమీ వుండవు పాతసూత్రాలే పనిచేస్తుంటాయి.

రెండవసారి మీరు దాడి చేశారని తెలిశాక కూడా మేము తొందరపడలేదు. పరిస్థితిని సమీక్షించడానికి ఇంకో రెండు వారాలు ఆగాము.  అసంఖ్యాక పీడిత సామాజిక వర్గాలకు ముప్పువున్న ప్రస్తుత తరుణంలో వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసంఖ్యాక సంఘాలు, వ్యక్తుల మధ్య సోదర సంబంధాలు వుండాలనీ, కొన్ని అపోహలు, విభేదాలూ వున్నప్పటికీ  సమస్యల  పరిష్కారం కోసం అణగారిన సమూహాలన్నీ కలిసి ముందుకు సాగాలని  మేము భావిస్తున్నాము. మీ విమర్శ మీద స్పందించడానికి ముందు అసలు  మీరు ఏమన్నారో మీ నుండే తెలుసుకోవాలను కున్నాము.  1. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం పనికి రాదని చెప్పాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది?  2. అసలు పౌరసమాజం భావన గురించి మీ అభిప్రాయం ఏమిటీ? 3. ఇది మీ అభిప్రాయమా? విరసం అభిప్రాయమా? అనే మూడు అంశాల మీద రాతపూర్వకంగా మీ వివరణ కోరాను. మీరు స్పందించలేదు.

మీ ఉపన్యాసాన్ని విందామని ఫేస్ బుక్ లో  arunatara - virasam వాల్ లోనూ, virasam వెబ్ సైట్‍ లోనూ వెతికాను. వాటిల్లో మీ ఉపన్యాసంతప్ప అందరి ఉపన్యాసాలూ వున్నాయి.  ఆ తరువాత విరసం కార్యదర్శి వరలక్ష్మీ, విరసం సభ్యులు  మరి కొందరితో  సంవాదం సాగింది. వాళ్ల మెసేజులు, ఫోన్ సంభాషణలనుబట్టి మీరు మీ శక్తిమేరకు  ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద సైధ్ధాంతిక దాడి చేశారని తెలిసింది. "the approach and the theoretical depth is appreciated" అని మీ ఉపన్యాసాన్ని విరసం కార్యదర్శి మెచ్చుకున్నారు.  "మావోయిస్టులుగా మేమిది  వర్గసమాజం అని చెప్తాం. రివేరా అన్నది ఇది. వర్గ దృష్టిని ఆయన emphasize చేశారు." అని వారు ఒక వివరణ కూడా ఇచ్చారు.

వర్గము అనేది కమ్యూనిస్టు ప్రత్యయం, పౌరులు అనేది (పెట్టుబడీదారీ) ప్రజాస్వామ్య ప్రత్యయం -  అని మీరు ఆ ఉపన్యాసంలో వాదించి వుంటే నేను మిమ్మల్ని మెచ్చుకుని వుండేవాడిని. అయితే ఈ విషయంలోనూ మీకు చిత్తశుధ్ధిలేదు. మావోయిస్టులయిన రచయితలు విరసాన్ని నడుపుతున్నట్టు, మావోయిస్టులయిన న్యాయవాదులు పౌరహక్కుల సంఘాన్ని నడుపుతున్నారన్న విషయాన్ని మీరు తెలివిగా మరచిపోయారు. మీరు పౌరులు అంటే అది విప్లవమూ! ఇతరులు పౌరులు అంటే అది వర్గ సంకరమూ!! ఇలాంటి పిల్లచేష్టల కారణంగానే కమ్యునిస్టుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఛీ కొట్టారు!

అయితే, "ఇది మీ సంస్థ  పౌరసమాజం గురించిగానీ, సాధారణ అర్థంలో వాడే పౌరసమాజం గురించిగానీ అన్నది కాదు." అని విరసం కార్యదర్శి ఒక వింత మినహాయింపును కోరే ప్రయత్నం చేశారు. దేనికయినా నిర్ధిష్ట  అర్ధమూ, సాధారణ అర్ధమూ కాకుండా మరో అర్ధం ఏముంటుందో  విరసం కార్యదర్శి వివరించాలి. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద మీ దాడిని విరసం ఆమోదించిందన్నదే ఇక్కడ కీలకం. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద విరసం దాడి చేసిందన్నదే ఇక్కడ ప్రాణప్రదమైన అంశం.

ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఎన్నడూ విరసం మీద దాడిచేయాలని అనుకోలేదు. విరసమే మహాసభల వేదిక సాక్షిగా ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం మీద దాడి చేసింది. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఇప్పుడు కూడా విరసం మీద ప్రతిదాడి చేయాలని అనుకోవడంలేదు. ఇక ముందు విరసంతో సోదర సంబంధాలను తెంచుకోవాలని మాత్రమే భావిస్తోంది.

శెలవు

ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం వర్ధిల్లాలి.

ఏం యం ఖాన్ యజ్దానీ (డానీ)
కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం.

Tuesday 27 October 2015

Maharashtra recalls controversial sedition circular

Updated: October 27, 2015 16:09 IST
Maharashtra recalls controversial sedition circular

Class 1-10 GK Questions - Important Problems, Model Answers, Question Bank. Join Now for Free! www.meritnation.com/GK-QA
Ads by Google
RAHI GAIKWAD
COMMENT   ·   PRINT   ·   T  T

inShare
1
In 2012, Mumbai Police arrested cartoonist Aseem Trivedi on charges of sedition, cybercrime and insulting the Constitution through his work. As the arrest sparked widespread outrage, sedition charges were revoked and the anti-corruption activist was let out on bail. Photo: The Hindu
The Hindu In 2012, Mumbai Police arrested cartoonist Aseem Trivedi on charges of sedition, cybercrime and insulting the Constitution through his work. As the arrest sparked widespread outrage, sedition charges were revoked and the anti-corruption activist was let out on bail. Photo: The Hindu
TOPICS
India
Maharashtra

crime, law and justice
laws
The Maharashtra government on Tuesday told the Bombay High Court that it has withdrawn its controversial circular on sedition.

Advocate General Shrihari Aney informed a division bench of Justices V.M. Kanade and Shalini Phansalkar-Joshi.

In light of the government's statement, the court disposed of petitions challenging the circular filed by cartoonist Aseem Trivedi, who was arrested in 2012 on the charge of sedition under section 124 A of the Indian Penal Code for his political cartoons.The court gave Mr. Trivedi and another petitioner Narendra Sharma the liberty to file fresh pleas on the suggestions they had submitted.

Last month, the High Court had stayed the circular.

The dangers in Vijayawada being the state capital

Andhra Pradesh: The dangers in Vijayawada being the state capital



N Chandrababu Naidu
Vijayawada will be the new capital of Andhra Pradesh. Chief minister N Chandrababu Naidu has conveniently ignored the Centre-appointed Sivaramakrishnan committee report while naming the city on the banks of the Krishna river in his haste to get things moving in his state. The report gives three options for a capital city which are well worth considering.
Mr Naidu has, however, agreed to the committee’s suggestion to decentralise power. His political opponents have raised the fact that Mr Naidu chose Vijayawada as it has a powerful Kamma presence — a community that has traditionally backed the Telugu Desam Party (TDP). That notwithstanding, Mr Naidu’s choice also seems to have miffed the people of the Rayalaseema region, with reports that even ministers from the region were unhappy with the choice. It is now up to the CM to ensure that the people of Rayalaseema do not feel alienated and that the new capital will also help in culturally unifying the whole state.
One of the major criticisms against choosing Vijayawada was the lack of government land. Right from the time of the bifurcation, following speculation, the Vijayawada-Guntur corridor saw a real estate boom and now the government will have to buy land at a premium. The Sivaramakrishnan committee report suggests that only a quarter of the estimated `4.5 lakh crore required for the new state capital will come from the Centre.
The state will have to raise the remaining amount and in such a scenario purchasing private land at exorbitant prices will put pressure on the state exchequer. Another area of concern, which was also raised in the report, was that large areas of fertile agricultural land in and around the Vijayawada-Guntur delta region will have to be acquired. This will impact the food security of the state and will likely displace a large number of farmers. This is cause for concern in a state where about 52% of the total workforce is employed in agriculture and related services. The environmental impact real estate expansion will have on the Krishna river and its adjoining area cannot be ignored. This gains significance in view of reports that the CM is keen to have key government offices near Amaravati, a historical town situated on the river bank.
Mr Naidu, like his Telangana counterpart K Chandrashekar Rao, has a golden opportunity to build a model state and not just a capital. In his previous tenure as CM of undivided Andhra Pradesh Mr Naidu focused extensively on building urban assets — he was instrumental in transforming Hyderabad into an IT hub in the country — but was criticised for ignoring development in the rural areas. He must not repeat this mistake with Vijayawada.