Tuesday 16 May 2023

Victory of Kannada civil society democracy

 కన్నడ పౌరసమాజ ప్రజాస్వామ్య విజయం

ABN , First Publish Date - 2023-05-16T01:05:03+05:30 IST

Victory of Kannada civil society democracy 

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఒక ఉక్కపోత వాతావరణంలో కొంత హాయిని కలిగించే గాలిలా ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, దాని నాయకత్వం తాము ఏది చేసినా చెల్లుతుందని, తమకు ఎదురులేదని ఒక భయానక స్థితిని కల్పించాయి. ఈ కాస్త ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగుతుందా, రాజ్యాంగ విలువలు నిలదొక్కుకోగలుగుతాయా, అసలు రాజ్యాంగం ఈ ధాటికి నిలుస్తుందా అన్న కొన్ని మౌలిక సవాళ్లు దేశం ఎదుర్కొంటున్నది. 

భారతీయ జనతాపార్టీ కేవలం ఇతర రాజకీయ పార్టీల వలె నిర్మాణమైతే సమస్య ఏం లేదు. సమస్యల్లా ఆ పార్టీని నడిపించే మాతృసంస్థల భావజాలమే జటిలమైన సమస్య. రాజ్యాంగ విలువలు ఒక్కరోజు పుట్టినవి కావు. వాటి వెనుక ప్రపంచవ్యాప్త ప్రజాపోరాటాలు, స్వాతంత్రోద్యమాలు, అసాధారణమైన త్యాగాలు, నూతన మానవ విలువలు, ఉన్నతమైన, ఉదాత్తమైన మానవ సంబంధాలు వాటి పునాదుల్లో ఉన్నాయి. చరిత్ర ముందుకుపోవడం, మానవ నాగరికత మరింత వికాసం చెందడానికి ఉన్నతమైన విలువలతో కూడిన నాగరిక సమాజం నిర్మాణం దిశలో ప్రయాణం ఉండాలి. సమాజాన్ని, ప్రజలని ముఖ్యంగా బలహీనులని ప్రేమించే తాత్వికత కావాలి. మనుషులని ద్వేషించడం, తమ భావజాలాన్ని అంగీకరించని వారిని ద్రోహులుగా, శత్రువులుగా భావించడంలోనే ప్రమాదం ఉంది. ఇవాళ సమస్యల్లా ఇలాంటి భావజాలమే.

ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీయైనా తన భావజాలాన్ని ప్రచారం చేసుకోవచ్చు. కాని ప్రతిపక్ష పార్టీలని రాజ్య యంత్రాంగాన్ని ఉపయోగించి భయభ్రాంతులకు గురిచేయడం గతంలో ఇందిరాగాంధీ పాలనలో కొంత జరిగినా, బిజెపితో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఆ ధోరణులకు అడ్డుకట్ట వేయగలిగారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని నడిపిస్తున్న శక్తులు తాము ఏది చేసినా, చట్టబద్ధ పాలనను ఖాతరు చేయకపోయినా, తాము ద్వేషించే వారి మీద ఏ దాడి చేసినా తమకు పూర్తి రక్షణ ఉంటుందనే బలం దీర్ఘకాలంలో చట్టబద్ధ పాలనకు ప్రమాదమే కాక, చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటే సమాజం అన్ని సమూహాలు క్రమక్రమంగా అదే మార్గం పడితే ఇక మిగిలేది ఒక అరాచక వ్యవస్థే.

ఈ చారిత్రక నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలను చూడవలసి ఉంటుంది. గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామిక విలువలతో కూడిన పార్టీ అని ఎవ్వరూ అనుకోవడం లేదు. అయితే ఆ పార్టీకి మద్దతిస్తున్న శక్తులు ద్వేషభావజాలంతో మండిపోతున్నవి కావు. వాళ్లు కొంతైనా రాజ్యాంగ విలువలను గౌరవిస్తారని, మెరుగైన పాలనను అందిస్తారని, ప్రజల సంక్షేమం గురించి కొంత పట్టించుకుంటారని కర్ణాటక సమాజం భావించింది. ఐదు సంవత్సరాలుగా కర్ణాటక సమాజం ఎదుర్కొన్న శాంతిభద్రతల సమస్య, మతపర ద్వేషం కర్ణాటకలోని పెట్టుబడిదారీ శక్తులకు కూడా సమస్యాత్మకమైంది. ఒక దశలో పారిశ్రామిక సంస్థలు, ఐటి రంగం, తాము బెంగళూరు నుంచి చెన్నై లేదా హైదరాబాద్‌కు తమ పరిశ్రమలను తరలిస్తామని హెచ్చరించారు. నిజానికి భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడికి, సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాకి కాంగ్రెస్‌ పార్టీ కంటే ఎక్కువ మద్దతు ఇవ్వడమే కాక, వాళ్లు కోరుకున్న అన్ని రాయితీలను కల్పించింది. ఈ రాయితీలతో పాటు పెట్టుబడి ఒక సామరస్య, సౌభ్రాతృత్వ సమాజాన్ని కోరుకుంటుంది. ఈ అభివృద్ధి నమూనా తీవ్రమైన అసమానతలకు దారితీసినప్పుడు అనివార్యంగా సమాజంలో అసంతృప్తి పెరుగుతుంది. ఈ అసంతృప్తిని ఎదుర్కొనడానికి అధికార పార్టీ ఎన్నుకున్న మార్గాన్ని కర్ణాటకలోని కార్పొరేట్‌ శక్తులు హర్షించలేదు. భారతీయ జనతా పార్టీ ఈ వైరుధ్యంలో చిక్కుకుంది.

కర్ణాటక సమాజానికి ఒక సుదీర్ఘమైన ప్రజాస్వామ్య, ఉదారవాద సంస్కృతి, సంస్కారం ఉంది. బసవన్న ఆలోచనాధార, నిచ్చెనమెట్ల సమాజాన్ని ప్రశ్నించి సామాజిక న్యాయభావనకు బలమైన బీజాలు వేసింది. ఆ తర్వాత ఎంతోమంది కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, సినిమా స్రష్టలు దాకా బసవన్న ఆలోచనాధారని సుసంపన్నం చేశారు. ఈ ఆలోచనాధార నుంచే దేవనూరు మహాదేవ లాంటి అద్భుత రచయిత ఎదిగారు. సమకాలీన కర్ణాటక సమాజంలో ఆయన ప్రభావం దళితశక్తుల మీదే కాక అన్ని ప్రజాస్వామ్య శక్తుల మీద విస్తృతంగా ఉంది. ఆయన జీవన శైలి చూస్తే నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత మనను ఆకట్టుకుంటాయి. ఈ నైతిక శక్తి వలన ఆయన రాసిన ‘‘ఆర్‌ఎస్‌ఎస్‌: దాని లోతుపాతులు’’ అనే పుస్తకం లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. తన పుస్తక ప్రచురణ హక్కుని తెలంగాణలో కాళోజీ లాగే ప్రజలకు ఇచ్చారు. ఈ పుస్తక ప్రభావం కర్ణాటక సమాజం మీద, ఎన్నికల మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పడింది. సమాజంలో ద్వేష రాజకీయాలు పుంజుకున్నప్పుడు కవులు, రచయితలు ఎలాంటి పాత్ర నిర్వహించాలో ఆయన నుంచి నేర్చుకోవలసి ఉంటుంది.

ప్రజాస్వామ్య వారసత్వం వల్ల కర్ణాటకలో ఒక సజీవమైన పౌరసమాజం ఉంది. ఈ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పౌరసమాజ ఛాయలు కూడా కనిపించవు. పౌర సమాజంలో పని చేస్తున్న 102 ప్రజాసంఘాలు తమ విభేధాలను పక్కకు పెట్టి అందరూ కలిసికట్టుగా గత ఆరు నెలలుగా రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. వాళ్ళు చేసిన కృషి నమ్మశక్యం కాని ఎత్తులో ఉంది. వాళ్లు ఎడ్డురే కర్ణాటక, మేలుకో కర్ణాటక అనే నినాదం చేపట్టారు. వాళ్లు 250 వర్క్‌షాప్స్‌, 103 నియోజకవర్గాల్లో, 192 బృందాలుగా ఏర్పడి, ఐదువేల మంది కార్యకర్తలు పనిచేశారు. వీళ్లు నలభై ఒక్కవేల కుటుంబాల వివరాలు సేకరించారు. 650 పోస్టర్స్‌, ఎనభై వీడియోలు, ఏడు ఆల్బమ్‌లను విడుదల చేశారు. పది లక్షల కరపత్రాలను పంచారు. అంతేకాక చిన్న చిన్న పార్టీల నుంచి పోటీ చేస్తున్న 49 మంది అభ్యర్థులను పోటీ నుంచి విరమించుకునేలా ఒప్పించారు. వంద విలేఖరుల సమావేశాలు నిర్వహించారు. యాభై ధర్నాలు (రైతులు, కార్మికులు, దళితులు, స్త్రీలు, విద్యార్థులు, ఆదివాసీలతో) నిర్వహించారు. మొత్తంగా 31 జిల్లాలలో 151 తాలూకాలలో ప్రచారం చేశారు.

ఈ వివరాలు చూసిన ఎవరికైనా ఆశ్చర్యం వేయక తప్పదు. భారతీయ జనతాపార్టీ విజయంలో చాలా అంకితభావంతో పనిచేసే వేలాది కార్యకర్తలున్నారు. ఏ ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఇలాంటి కార్యకర్తలు లేరు. ఆ పార్టీ బలమంతా ఈ కార్యకర్తలే. వారి కృషికి సమానస్థాయిలో కర్ణాటకలో ఈ ప్రజాసంఘాల కార్యకర్తలు పనిచేశారు.

కర్ణాటక చేసిన ఈ ప్రయోగం చాలా విలువైనది. వాళ్లు ఎక్కడా ఫలానా పార్టీకి ఓటు వేయండి అని ప్రచారం చేయలేదు. విద్వేష రాజకీయాలకు మద్దతు ఇవ్వకండి అని మాత్రమే ప్రచారం చేశారు. ఎక్కడా భారతీయ జనతా పార్టీ పేరు కూడా తీసుకోలేదు. ఎన్నికల రాజకీయాలకు బయట పనిచేశారు. వాళ్లు చేసిందల్లా పౌరసమాజ చైతన్యాన్ని పెంచడం. ప్రజాస్వామ్య సమాజాలు, దేశాల భవిష్యత్తును రాజకీయ పార్టీలకే వదలకూడదు. మనదేశంలో అమలులో ఉన్న అభివృద్ధి నమూనా నిర్బంధం లేకుండా అమలుచేయడం సాధ్యం కాదు. కాంగ్రెస్‌ పార్టీ కాలంలో కూడా ఎన్నో నిర్బంధ చట్టాలు వచ్చాయి. భిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యవహారశైలిలో ఈ నియంతృత్వ ప్రవర్తన చూడవచ్చు. ఈ అభివృద్ధి స్వభావమే అలాంటిది. దీనికి తెలంగాణయే పెద్ద ఉదాహరణ. ఒక సామాజిక ఉద్యమం నుంచి ఆవిర్భవించిన పార్టీ ప్రవర్తన మిగతా పార్టీలకు భిన్నంగా లేదు. ఇలాంటి చారిత్రక సందర్భంలో ఏ సమాజంలోనైనా ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడం చైతన్యవంతమైన సమాజానికే సాధ్యం. అలాంటి సమాజ నిర్మాణమే ఇవాళ దేశభవిష్యత్తు గురించి మధనపడే వాళ్ల సామాజిక, చారిత్రక బాధ్యత.

ప్రొ. జి. హరగోపాల్‌ 


Wednesday 25 January 2023

లోకేశ్‌ పాదయాత్రకు పోలీసుల నిబంధనలు

 లోకేశ్‌ పాదయాత్రకు పోలీసుల నిబంధనలు

ABN , First Publish Date - 2023-01-25T02:31:26+05:30 IST


నాడు.. సరిగ్గా ఐదేళ్ల కిందట... టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేశారు.


Lokesh Padayatra: లోకేశ్‌ పాదయాత్రకు పోలీసుల నిబంధనలు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్

సం|| 93979 79750


లోకేశ్‌ పాదయాత్రకు పోలీసుల నిబంధనలు


తేడా వస్తే అనుమతులు రద్దు


15 షరతులు విధించిన పలమనేరు డీఎస్పీ



Powered By

VDO.AI


పంచాయతీ రోడ్లపైనా సభలు పెట్టొద్దు


తొలి మూడు రోజులకు మాత్రమే అనుమతి


నాడు రాష్ట్రస్థాయిలో జగన్‌ యాత్రకు అనుమతి


మూడంటే మూడు నిబంధనలతో జగన్‌ యాత్ర


నేడు అడుగడుగునా ఆంక్షలు, షరతులు


సబ్‌డివిజన్‌లవారీగా దరఖాస్తు తప్పదు


ఆంక్షలపై టీడీపీ నేతల్లో విస్మయం


అందరి యాత్రల్లాగే సాగుతుంది: టీడీపీ నేతలు


(అమరావతి/చిత్తూరు - ఆంధ్రజ్యోతి): నాడు.. సరిగ్గా ఐదేళ్ల కిందట... టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేశారు. అప్పుడు ఆయన పాదయాత్రకు పోలీసులు మూడంటే మూడు నిబంధనలతో అనుమతి ఇచ్చారు. పాదయాత్రలో ఊరూరా తిరిగిన జగన్‌ హామీల వర్షం కురిపించి, చంద్రబాబు పాలనపై ఆరోపణలు గుప్పించి అధికారంలోకి వచ్చారు.


నేడు..


ఈనెల 27వ తేదీ నుంచి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ యువనేత నారా లోకేశ్‌ పాదయాత్ర తలపెట్టారు. ‘యువగళం’ పేరుతో కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు... 400 రోజులు 4000 కిలోమీటర్లు నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ యాత్రకు అనుమతి ఇస్తున్నదీ, లేనిదీ చెప్పకుండా పోలీసులు సోమవారం దాకా నాన్చారు. మంగళవారం చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ ఎన్‌.సుధాకర్‌ రెడ్డి ఈ యాత్రకు అనుమతి ఇచ్చారు. అదీ... అనేక షరతులతో! ‘గీత దాటితే అనుమతులు రద్దు చేస్తాం’ అని సూటిగా చెప్పారు. ఈ అనుమతులు కూడా పలమనేరు సబ్‌డివిజన్‌ పరిధికి మాత్రమే వర్తిస్తాయి. ఆ తర్వాత మరో డీఎస్పీ నుంచి అనుమతి తీసుకోవాలి. అప్పట్లో జగన్‌కు డీజీపీ స్థాయిలో రాష్ట్రమంతా పాదయాత్ర చేసుకోవడానికి ఒకేసారి అనుమతి లభించగా... ఇప్పుడు లోకేశ్‌ పాదయాత్రకు డీఎస్పీ స్థాయి అధికారులతో ఎక్కడిక్కడ అనుమతులు తీసుకోవాలనడం గమనార్హం. లోకేశ్‌ పాదయాత్రకు పలమనేరు డీఎస్పీ ఏకంగా 15 షరతులు విధించారు. అవి చూసి టీడీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది రెండు కాళ్లూ కట్టేసి, ఇక నడవండి అన్నట్లుగా ఉందని మండిపడుతున్నారు.


అడ్డంకులు సృష్టించేందుకే..


లోకేశ్‌ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడానికి పోలీసుల ద్వారా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పట్టించుకోరాదని టీడీపీ నిర్ణయించుకుంది. ఆంక్షలపై పార్టీ సీనియర్లు చర్చించుకున్నారు. గతంలో ఏ పాదయాత్రకూ ఇలాంటి షరతులు విధించలేదని, ఇందులో రాజకీయ దురుద్దేశం ఉందని అభిప్రాయపడ్డారు. ‘గతంలో పాదయాత్రలు ఎలా జరిగాయో ఇదీ అలాగే జరుగుతుంది. పోలీసుల పేరుతో షరతులు పెట్టి ఆటంకాలు కలిగించాలని చూసినా వాటిని మేం పట్టించుకోదల్చుకోలేదు. మేమెలా అనుకున్నామో అలాగే వెళ్తాం. ఇది మా పార్టీ నిర్ణయం’ అని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘జగన్‌ ఎలా పాదయాత్ర చేశారో లోకేశ్‌ కూడా అలాగే చేస్తారు. అడ్డుపడాలని చూస్తే ప్రతిఘటిస్తాం. ప్రభుత్వం అడ్డుపడితే ప్రజలు మరింత మంది వస్తారు. వైసీపీ తన గొయ్యి తాను తవ్వుకొంటే మేమేం చేస్తాం’ అని మరో నాయకుడు అన్నారు. ఇంకోవైపు.. ఈ సుదీర్ఘ పాదయాత్రకు అటు లోకేశ్‌, ఇటు టీడీపీ నేతలు, కార్యకర్తలు పూర్తి స్ధాయిలో సన్నద్ధమవుతున్నారు.


తాను ఒక ఏడాదిపాటు ఇంటికి వచ్చేది లేదని భార్య బ్రాహ్మణికి, కొడుకు దేవాన్ష్‌కు లోకేశ్‌ చెప్పారు. ఆయన బృందాల్లో ఒకటి ఈ యాత్రకు సంబంధించి వాహనాలు, రాత్రి బస, భోజన వసతి, సెక్యూరిటీ తదితర అంశాలు చూసుకొంటోంది. మరో బృందం ఈ యాత్రలో లేవనెత్తాల్సిన అంశాలు, ప్రజల నుంచి వినవచ్చే సమస్యలు, వివిధ వర్గాలతో జరిపే సమావేశాల్లో చెప్పాల్సిన విషయాలపై కసరత్తు చేస్తోంది. మరో బృందం యాత్ర పొడవునా పార్టీ నేతలతో సమన్వయ బాధ్యతలు నిర్వహించే పని నిర్వర్తిస్తోంది. ఈ యాత్రలో లోకేశ్‌ సుమారు నూట పాతిక అసెంబ్లీ నియోజకవర్గాలు సందర్శించనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున మూడు రోజులు యాత్ర కొనసాగుతుంది.


నేడు లోకేశ్‌ పాదయాత్రకు...


లోకేశ్‌ పాదయాత్రకు అనుమతి ఇస్తూ చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ ఎన్‌. సుధాకర్‌ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఏకంగా పదిహేను నిబంధనలు పెట్టారు. ఈ అనుమతి కూడా తన పరిధిలో ఉన్న ప్రాంతం వరకూ మాత్రమే ఇచ్చారు.


1) ఈ అనుమతి ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం ఆరు వరకే వర్తిస్తుంది. (పలమనేరు సబ్‌డివిజన్‌ పరిధిలో మాత్రమే)


2) శాంతి భద్రతలకు, శాంతికి భంగం వాటిల్లే పరిస్థితులు ఉత్పన్నమైతే ఈ అనుమతిని ముందస్తు సమాచారం కూడా లేకుండా రద్దు చేయవచ్చు లేదా సవరించవచ్చు.


3) జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల మీద సభలు పెట్టరాదు. అత్యవసర సర్వీసులు, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం కలిగించరాదు. ఇరుకుగా ఉన్నందువల్ల మునిసిపల్‌ రోడ్లు, పంచాయితీరాజ్‌ రోడ్లపై కూడా సభలు పెట్టరాదు. సభ పెట్టాల్సి వస్తే విడిగా ఒక స్థలం చూసుకోవాలి. తగినంత ముందుగా దాని గురించి సంబంధిత డీఎస్పీకి తెలియజేసి ముందస్తు అనుమతి పొందాలి.


4)పాదయాత్ర లేదా రోడ్‌ షోను బహిరంగ సభగా మార్చరాదు.


5) పాదయాత్ర సందర్భంగా వివిధ వర్గాల వారితో నిర్వహించే సమావేశాలు బహిరంగ సభల మాదిరిగా నిర్వహించరాదు. రోడ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఇటువంటి సమావేశాల్లో మైక్‌ ఉపయోగించాలంటే ముందుగా పోలీస్‌ అనుమతి తీసుకోవాలి. బహిరంగ సభ మాదిరిగా నిర్వహించాలనుకుంటే సంబంధిత డీఎస్పీ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి. బహుళ ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ మార్గాలున్న ప్రదేశాలను వీటికి ఎంపిక చేసుకోవాలి.


6) పాదయాత్ర లేదా రోడ్‌ షో మొత్తం రహదారిని మూసివేయకుండా చూడాలి. రోడ్డుపై ప్రజలు, ట్రాఫిక్‌ ప్రయాణించడానికి ఆటంకాలు లేకుండా చూడాలి.


7) అనుమతించిన సంఖ్యకన్నా ఎక్కువ వాహనాలు పాదయాత్రలో వినియోగించకుండా జాగ్రత్త వహించాలి. 8)రద్దీని నివారించడానికి, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూడటానికి, ప్రజల రక్షణ నిమిత్తం తగినంత సంఖ్యలో మహిళా, పురుష వలంటీర్లను పెట్టుకోవాలి. వలంటీర్లు అందరూ యూనిఫాం వేసుకోవాలి. రద్దీని అదుపు చేయడానికి తాళ్ళు కూడా చాలినంత సంఖ్యలో పెట్టుకోవాలి.


9) ముందుగా తెలిపిన దారి, సమయాలను పాటించాలి.


10) పాదయాత్రలో డీజే సిస్టమ్‌, లౌడ్‌ స్పీకర్లు వాడటానికి వీల్లేదు. తక్కువ శబ్దం వచ్చే సింగిల్‌ సౌండ్‌ బాక్స్‌ సిస్టం మాత్రమే వాడాలి. ఎక్కడైనా ఆగిన చోట మాత్రమే మైక్‌ వాడాలి.


11) పాదయాత్రలో పాల్గొనేవారు మారణాయుధాలు, రాళ్ల వంటివి ఉంచుకోకూడదు. మద్యం వాడకం నిషేధం. బాణాసంచా పేల్చరాదు.


12) నిబంధనల ప్రకారమే డ్రోన్లు, ఫ్లైయింగ్‌ కెమెరాలు వాడాలి.


13) పాదయాత్రలో పాల్గొనే వారి రక్షణకు నిర్వాహకులు పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఒక అంబులెన్సు సిద్ధంగా ఉండాలి. రాత్రి బస చోట బారికేడ్లు, సరిపోను లైట్లు పెట్టాలి. ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


14) పాదయాత్రకు హాజరయ్యే వారి వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలగకుండా నిర్వాహకులు జాగ్రత్త తీసుకోవాలి.


15) పైనిబంధనలన్నింటికీ కట్టుబడి ఉంటామని, వాటిని ఉల్లంఘిస్తే తమదే బాధ్యత అని నిర్వాహకులు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలి. వీటిని పాటించకపోతే పాదయాత్ర అనుమతిని రద్దు చేయడానికి, న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులకు హక్కు ఉంటుంది. 1861 పోలీస్‌ చట్టంలోని సెక్షన్‌ 30లోని ఒకటి, రెండు, మూడు, నాలుగు అంశాల కింద ఈ అనుమతి ఇస్తున్నట్లు అందులో తెలిపారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ పేరుతో ఈ అనుమతి జారీ అయింది.


నేడు కడప దర్గాకు లోకేశ్‌


తిరుపతి/అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ నేటి రాత్రికి తిరుమల రానున్నారు. 27న కుప్పం నుంచి సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన మూడు ప్రసిద్ధ ప్రార్థనా స్థలాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు, పూజలు జరపనున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులు అర్పించి విమానంలో కడప చేరుకుంటారు. అక్కడ ప్రఖ్యాత అమీన్‌పీర్‌ దర్గాను, ప్రసిద్ధ రోమన్‌ కేథలిక్‌ చర్చిని సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు కడప నుంచి బయల్దేరి రాత్రి 10గంటలకు తిరుమల చేరుకుంటారు. రాత్రికి అక్కడే జీఎంఆర్‌ గెస్ట్‌హౌ్‌సలో బస చేస్తారు. గురువారం ఉదయం కుటుంబంతో కలసి శ్రీవారిని దర్శించుకుని 10.30కు కుప్పం వెళ్లి అక్కడ బస చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం వరదరాజుల స్వామి ఆలయంలో పూజలతో యాత్ర ప్రారంభమవుతుంది. కుప్పంలో సభ నిర్వహిస్తారు.


రక్షణ కల్పించాల్సింది పోయి ఆంక్షలా: అచ్చెన్న?


జగన్‌రెడ్డి పర్యటనలకు ముళ్ల కంచెలు పెట్టి మరీ రక్షణ కల్పిస్తున్న పోలీసులు.. లోకేశ్‌ పాదయాత్రకు ఆంక్షలు విధిస్తారా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. యువగళం పాదయాత్రపై ప్రభుత్వ ఆంక్షలు జగన్‌రెడ్డి అభద్రతాభావానికి అద్దం పడుతున్నాయని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. లోకేశ్‌ పాదయాత్ర ప్రకటన చేసినప్పటి నుంచే వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ‘ప్రతిపక్ష నేతలకు పాదయాత్ర చేసే హక్కు లేదా? నాడు చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తే జగన్‌రెడ్డి పాదయాత్ర చేసేవారా? ఎన్ని కుట్రలు పన్నినా లోకేశ్‌ పాదయాత్రను అడ్డుకోలేరు’అని అన్నారు.


అవి సాధారణ నిబంధనలే!


మా నుంచి అన్నివిధాలా సహకారం


‘ఆంధ్రజ్యోతి’తో చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి


‘‘లోకేశ్‌ పాదయాత్రకు మేం సూచించిన నిబంధనలన్నీ చాలా సాధారణమైనవే. ఆంక్షలతో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని అనవసరంగా కొందరు వదంతులు సృష్టిస్తున్నారు. ఆయన పాదయాత్రకు మా శాఖ నుంచి అన్నివిధాలా భద్రత, సహకారం ఉంటుంది’’ అని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘చిత్తూరు జిల్లాలో లోకేశ్‌ పాదయాత్ర మొత్తం నేషనల్‌ హైవే మీదుగా సాగుతుంది. హైవే మీద ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించినా అందరూ ఇబ్బంది పడతారు. పాదయాత్రకు ఇబ్బంది కలిగించాలనే ఆలోచన మాకు లేదు. వీలైనంత వరకు అన్ని విధాలుగా సహకరిస్తాం. అవసరమైన భద్రత కల్పిస్తాం. ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్ర వివరాలను ఎప్పటికప్పుడు అందించి, అనుమతులు తీసుకోవాలి. ప్రస్తుతానికి కుప్పం కార్యక్రమాలకు అనుమతులిచ్చాం. పాదయాత్ర సాగే రెండో నియోజకవర్గం పలమనేరు షెడ్యూల్‌ ఇంకా ఇవ్వలేదు.


జిల్లా మొత్తం ఇవే నిబంధనలతో మంజూరు చేస్తాం’’ అని ఎస్పీ వివరించారు. ఏవైనా కార్యక్రమాలు చేపడితే... నిర్వాహకులు కొంత బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పోలీసు శాఖ తరఫున తాము కూడా బాధ్యత వహించి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ‘‘పాదయాత్రకు అవసమైన పూర్తిస్థాయి భద్రత ఇస్తాం. టీడీపీ నాయకులు ఎన్ని వాహనాలకు అనుమతి కోరారో, అన్నింటికీ అనుమతి ఇచ్చేశాం. ఉద్దేశపూర్వకంగా వాహనాల సంఖ్యను తగ్గించలేదు’’ అని స్పష్టం చేశారు.