|
ప్రజల అవసరాలకు, ప్రభుత్వ ఆబ్లిగేషన్లుకు మధ్య చాలా పెద్ద అగాధం ఉంది. ఈ అగాధం రోజురోజుకూ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఈ అగాధాన్ని తగ్గించడం నేటి చారిత్రక అవసరం. ఆ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పౌరసమాజంపై ఉంది. చారిత్రక సంది సమయంలో ఒక చారిత్రక బాధ్యతను నిర్వర్తించడానికి ఆంధ్రప్రదేశ్ పౌరసమాజమనే సంస్థను నెలకొల్పాలని సంకల్పించాము. ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం, ఆవిర్భావ సమావేశం ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గుంటూరులోని వజ్రం హోటల్లో జరుగుతుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనే కాక కొత్త రాష్ట్రంలోని జిల్లాలన్నింటిలో ప్రాంతీయ సమస్యల పరిష్కారంతోపాటు ఇంకా అనేక సమస్యలపై ఉద్యమిస్తున్న శక్తులన్నింటినీ ఒక వేదిక మీదకు తేవడం ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం సంస్థ తన తొలి లక్ష్యంగా భావిస్తోంది. ఇది అందరి సంఘం. ఏ ప్రజా సంఘంలో పనిచేస్తున్నవారైనా, ఏ రాజకీయ భావాలు గలవారైనా, ఏ వృత్తిలో ఉన్నవాళ్లయినా ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం సంస్థలో సభ్యులుగా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం సంస్థ ప్రధాన లక్ష్యం ప్రజల పక్షం వహించడం ఒకటే కొలమానం.
- ఏ.యం. ఖాన్ యజ్దానీ (డానీ)
http://www.andhrajyothy.com/Artical?SID=142210
|
No comments:
Post a Comment