Monday, 12 October 2015

భూములు ఇవ్వని రైతులకు విద్యుత్ కనెక్షన్ కట్

భూములు ఇవ్వని రైతులకు విద్యుత్ కనెక్షన్ కట్
Updated :12-10-2015 14:27:54
 తూర్పుగోదావరి : కాకినాడ సెజ్‌లో భూములు ఇవ్వని రైతులకు అధికారులు విద్యుత్ కనెక్షన్‌లు కట్ చేశారు. దీంతో రైతులందరూ పీఠాపురం ఉప్పాడ సెంటర్‌లోని గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా పలువురు రైతులు మాట్లాడుతూ... సెజ్‌కు భూములు ఇవ్వని రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడమేగాక బెదిరింపు ధోరణులకు పాల్పడుతోందన్నారు. నేడు విద్యుత్ కనెక్షన్‌లు కట్ చేయించిన ప్రభుత్వం రేపు తమను ఏం చేస్తుందో అంటూ వారు వాపోయారు.

No comments:

Post a Comment